చెట్ల పొదల్లో గుర్తుతెలియని బైక్: ఆందోళనలో ప్రజలు

చెట్ల పొదల్లో గుర్తుతెలియని బైక్: ఆందోళనలో ప్రజలు

మోత్కూర్(ముద్ర న్యూస్): మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని కాశవాడ ఎదురుగా, తిరుమలగిరి మోత్కూర్ ప్రధాన రహదారి వెంట ఉన్న  చెట్ల పొదలలో పార్క్ చేసి ఉన్న  గుర్తు తెలియని బైక్ భయాందోళనలో కాశవాడ ప్రజలు , రెండు రోజుల క్రితం  ఈ బైక్ ను గుర్తించిన కాలనీవాసులు, గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో చెట్లపొదలలో పార్క్ చేసి వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. వెంటనే పోలీసులు చర్యలు చేపట్టి మిస్టరీగా మారిన బైక్ వివరాలను ఛేదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.