ఆసియా కప్ తొలిసారిగా పోటీలో నేపాల్
- మెరుగైన ఆటతీరుతో పాక్
- రెండోస్థానంలో భారత్
ముంబై: ఆసియాకప్లో మెరుగైన ఆటతీరుతో పాకిస్థాన్48 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, భారత్46.69శాతంతో రెండోస్థానంలో ఉంది. ఈ కప్లో గతంలో జరిగిన మ్యాచ్లో మెరుగైన ప్రదర్శనను పాక్ప్రదర్శించింది. క్రికెట్ చరిత్రలో వన్డే, టీ–20, చాంపియన్స్ట్రోఫీ, ఆసియాకప్, ప్రపంచ టెస్ట్చాంపియన్అనే ప్రధానమైన ఐదు టైటిల్స్ను నిర్వహిస్తుంటారు. ఇందులో భారత్ 12, శ్రీలంక9, పాకిస్థాన్5 మేజర్టైటిల్స్ను గెలుచుకున్నాయి. ఆసియా ఖండంలో అంతర్జాతీయ, టీ–20 క్రికెట్లకు అభిమానులెక్కువ. క్రికెట్అభిమానులు ప్రపంచంలోనే భారత్లో ఎక్కువగా ఉన్నారు. అత్యధిక టైటిళ్లను గెలుచుకోవడంలో భారత్, పాక్లు పోటీ పడుతున్నాయి. ఐసీసీ, ఏసీసీ విజయాలలో ఈ రెండు జట్లు ముందంజలో ఉన్నాయి. గ్రాఫిక్ ప్రకారం చూస్తే పాక్ముందు, తరువాత భారత్స్థానం కొనసాగిస్తోంది. భారత జట్టు 91 సంవత్సరాలుగా క్రికెట్ను కొనసాగిస్తోంది. మొదటి వన్డేను 25 జూన్ 1932న ఇంగ్లాండ్తో ఆడింది. ఇక ఆసియా జట్లలో భారత్ తర్వాత అత్యధిక ట్రోఫీలను గెలుచుకున్నది శ్రీలంక. జట్టు తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ను 7 జూన్ 1975న ఆడింది. భారత్, పాక్, శ్రీలంకలు పెద్ద టోర్నీలు గెలవడంలో ముందువరుసలో ఉన్నాయి. బంగ్లా, ఆఫ్ఘనిస్థాన్ల ఆటతీరు అంతంతమాత్రంగానే ఉంది. కాగా ఈసారి ఆసియా కప్లో నేపాల్తొలిసారి ఆడనుండడం విశేషం.
ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభమవుతుంది. క్రికెట్ ప్రపంచ కప్ ముగిసిన 17 రోజుల తర్వాత భారతదేశంలో ప్రారంభమవుతుంది. ఈ రెండు టోర్నీలు వన్డే ఫార్మాట్లో ఉంటాయి. అంటే తర్వాతి రెండున్నర నెలలు 50–-50 ఓవర్ల క్రికెట్ మ్యాచ్లు. అయితే వన్డే ఫార్మాట్పై ఉన్న ఆందోళన మరోలా ఉంది. గత 4 సంవత్సరాలలో, వన్డే ఇంటర్నేషనల్ఫార్మాట్ బహుశా టీ–20గా మారిపోనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. 50–50 ఓవర్ల మ్యాచ్లపై క్రమేణా క్రికెట్ అభిమానులకు ఆసక్తి తగ్గుతోంది. 20 –20 ఆటతీరు వైపే అభిమానులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్నెస్మ్యాచ్నిర్వహణ, సమయాభావం తదితర అంశాలన్నింటినీ బేరీజు వేసుకున్నా వన్డేకంటే 20–20 బెటర్ అనే వాదన అభిమానుల నుంచి వినిపిస్తోంది.