ఇంగ్లండ్‌పై అఖండ విజయం

ఇంగ్లండ్‌పై అఖండ విజయం
  • కాన్వే, రచిన్‌ మెరుపు శతకాలు..
  • 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ విక్టరీ 

అహ్మదాబాద్​ : వన్డే వరల్డ్‌కప్‌ ఆరంభ పోరులో న్యూజిలాండ్‌ గ్రాండ్‌ విక్టరీ అందుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ బ్యాటర్లు డెవిన్‌ కాన్వే (140), రచిన్‌ రవీంద్ర (117 ) మెరుపు శతకాలతో విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇద్దరే అవలీలగా చేధించారు. 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌కు భారీ విజయాన్ని అందించారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఆటగాళ్ల వికెట్లను వరుసగా పడగొడుతూ షాకుల మీద షాకిచ్చింది. దీంతో బెయిర్‌స్టో (33), మలన్‌ (14), బ్రూక్‌ (25), అలీ (11), బట్లర్‌ (43), లివింగ్‌స్టోన్‌ (20) తక్కువ పరుగులకే ఔట్‌ చేసి పెవిలియన్‌కు చేరింది. ఈ క్రమంలో కివీస్‌ బౌలర్లను తట్టుకుని జో రూట్‌ ( 77) ఒక్కడే నిలబడ్డాడు. హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. రూట్‌ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్‌ ఓక్స్‌ ( 11), సామ్‌ కర్రన్‌ (14) కూడా కివీస్‌ బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి 282 పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 3, గ్లెన్‌ ఫిలిప్స్‌ 2, మిచెల్‌ శాంటర్న్‌ 2, ట్రెంట్‌ బౌల్ట్‌, రచిన్‌ రవీంద్ర చెరో వికెట్‌ తీశారు.