టీఎస్​పీఎస్సీకి నోటిఫికేషన్​ ఈ నెల 18 వరకే అప్లై

టీఎస్​పీఎస్సీకి నోటిఫికేషన్​ ఈ నెల 18 వరకే అప్లై

ముద్ర, తెలంగాణ బ్యూరో :టీఎస్​పీఎస్సీ పాలకవర్గం నియామకానికి నోటీఫికేషన్ విడుదలైంది. ఉద్యోగాలను భర్తీ చేసే ఈ కమిషన్​లో ముందుగా పాలకవర్గాన్ని నియమించనున్నారు. ఇప్పటికే పలు ఆరోపణలతో పాలకవర్గం చైర్మన్​జనార్ధన్​రెడ్డి, సభ్యులు రవీందర్​రెడ్డి, లింగారెడ్డి, సత్యనారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఇటీవలే వీరి రాజీనామాలను గవర్నర్​ ఆమోదించారు. ప్రస్తుతం పాలకవర్గంలో ఇద్దరు సభ్యులున్నారు. అయితే, టీఎస్​పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్​ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు.