టీఎస్పీఎస్సీకి నోటిఫికేషన్ ఈ నెల 18 వరకే అప్లై
ముద్ర, తెలంగాణ బ్యూరో :టీఎస్పీఎస్సీ పాలకవర్గం నియామకానికి నోటీఫికేషన్ విడుదలైంది. ఉద్యోగాలను భర్తీ చేసే ఈ కమిషన్లో ముందుగా పాలకవర్గాన్ని నియమించనున్నారు. ఇప్పటికే పలు ఆరోపణలతో పాలకవర్గం చైర్మన్జనార్ధన్రెడ్డి, సభ్యులు రవీందర్రెడ్డి, లింగారెడ్డి, సత్యనారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఇటీవలే వీరి రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ప్రస్తుతం పాలకవర్గంలో ఇద్దరు సభ్యులున్నారు. అయితే, టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు.