వివేకానందుని అడుగుజాడల్లో నడుద్దాం

వివేకానందుని అడుగుజాడల్లో నడుద్దాం

*నేతాజీ నగర్ లో ఘనంగా జయంతి వేడుకలు

ముద్ర న్యూస్ బ్యూరో,

హైదరాబాద్: కార్వాన్ నియోజకవర్గంలోని నేతాజీ నగర్ కాలనీలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ వివేకానందుని జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన బోధనలను అధ్యయనం చేయాలని అన్నారు.  ఆయన సూక్తులను పాటిస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని యువతకు వారు సూచించారు. భారత జాతి కీర్తిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన వివేకానందుడు చిరస్మరణీయుడని వక్తలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి అప్పారావు, ఉపాధ్యక్షులు అంజిరెడ్డి, మహమ్మద్ సర్వర్, కోశాధికారి ప్రభాకర్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఏ కృష్ణమూర్తి, అసోసియేషన్ నాయకులు టిఎస్ ఆనంద్ రెడ్డి, కే వీబీ  మురళీమోహన్ రావు, సి. శ్రీనివాస్, పూర్ణచందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.