ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు కేసీఆర్ మొగ్గు చూపారు: కేటీఆర్
బయ్యారం, కడపలో స్టీల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్న మంత్రి కేటీఆర్. బయ్యారం స్టీల్ ప్లాంట్ కోసం నేను ప్రధానిని కలిశానన్నారు. బయ్యారం విషయంలో మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మోదీకి చెప్పాం. నేను ప్రధానిని కలిసిన నాలుగు నెలల కు అదానీ గ్రూప్ కంపెనీ పెట్టింది. బైలదిల్లాలో ఐరన్ ఓర్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నామని కేంద్రం చెప్పింది. కాని బైలదిల్లా ఐరన్ ఓర్ కంపెనీని అదానీ స్టార్ట్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు కేసీఆర్ మొగ్గు చూపారు. పీఎస్యూలు అమ్మేస్తే వచ్చే సమస్యలేంటో చాలాసార్లు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో బీహెచ్ఈఎల్కు అధికంగా ఆర్డర్లు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బీమా పథకాలన్నీ ఎల్ఐసీకి అప్పగించారు. నష్టాలను జాతికి అంకితం చేయడం, లాభాలు నచ్చిన వ్యక్తులకు అప్పగించడం కేంద్రం ఆలోచన. సెయిల్ ద్వారా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు పరిశీలిస్తామని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు.