ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముద్ర, ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ మార్కెట్, బాపూజీ నగర్ లో బస్తీలలో శనివారం ఎమ్మెల్యే అధికారులతో కలిసి పర్యటించారు. వాసులు కలుషిత మంచినీరు మరియు డ్రైనేజ్ పనులు, కొత్త రోడ్లు నిర్మాణం, విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగోపాల్ మాట్లాడుతూ తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వీలైనంత తొందరలో పరిష్కరిస్తామని బస్తీ వాసులకు హామీ ఇచ్చారు.

ముఖ్యంగా కలిసికనీరు డ్రైనేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కారులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్  నాయకులు ముఠా జైసింహ, స్థానిక డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు హైమద్ భక్తియార్, గోవింద్, బిక్షపతి యాదవ్, గజ్జల సూర్యనారాయణ, భరత్ నరసింహ, బాబురావు, శివ ముదిరాజ్, దీన్ దయాల్ రెడ్డి, వెంకటేష్, టెంట్ హౌస్ సీను, లింగాల శ్రీకాంత్ గౌడ్, సదా ముదిరాజ్, రాజేందర్, భాస్కర్ , సంతోష్, నవీన్, గోరఖ్నాథ్, గడ్డమీద శ్రీనివాస్,నాని రామ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.