రైల్వే బోర్డు మెంబర్‌‌కు సన్మానం

రైల్వే బోర్డు మెంబర్‌‌కు సన్మానం

ఉప్పల్‌, ముద్ర : రైల్వే బోర్డు మెంబర్‌‌గా (జెడ్ఆర్‌‌యూసీసీ) నియమితులైన డా. వై. రాజ్‌కుమార్‌‌ను శ్రీకాణిపాక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షుడు సాయి కృష్ణ మాట్లాడుతూ రాజ్‌కుమార్‌‌ ఓల్డ్‌ సిటీ నుంచి రైల్వే బోర్డు మెంబర్‌‌గా ఎన్నిక కావడం సంతోషకరమన్నారు. ఆయన బీజేపీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ అనేక సేవ కార్యక్రమాలు చేయడం, ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజలకు ఎంతో సాయం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆశిష్ దుబే, నవీన్, సాయినాథ్, అరుణ్, హరికృష్ణ, సునీల్, దినేష్, రవికాంత్, వినోద్ పాల్గొన్నారు.