భట్టి విక్రమార్కకు కొనసాగుతున్న చికిత్స

భట్టి విక్రమార్కకు కొనసాగుతున్న చికిత్స

ముద్ర ప్రతినిధి, మహబూబ్ నగర్ : సీఎల్సీ నేత భట్టి విక్రమార్కకు చికిత్స కొనసాగుతుంది. మండుటెండలో పాదయాత్ర కారణంగా భట్టి వ‌డ‌దెబ్బతో స్వల్ప అస్వస్థత‌కు గురైన విషయం తెలిసిందే. దీంతో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా జ‌డ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం న‌వాబ్ పేట మండ‌లంలోని రుక్కంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన టెంట్ లోనే భ‌ట్టి విక్రమార్కకు  జ‌న‌ర‌ల్ ఫిజిషీయ‌న్ డాక్టర్ ప‌ర‌దేశి, డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ వైద్యం అందిస్తున్నారు.  వ‌డ‌దెబ్బతో డీ హైడ్రేష‌న్ ను గురికావ‌డంతో త‌గిన విశ్రాంతి త‌ప్పనిస‌రిగా తీసుకోవాలని స్పష్టం చేశారు.  డీ హైడ్రేష‌న్ పూర్తిగా తగ్గేవ‌ర‌కూ ఎండ‌ల్లో న‌డ‌వ‌కూడ‌ద‌ని భ‌ట్టికి  వైద్యులు సూచించారు.