రంగాపూర్ శివారులో డెడ్ బాడీ లభ్యం

రంగాపూర్ శివారులో డెడ్ బాడీ లభ్యం

 ముద్ర ప్రతినిధి, వనపర్తి:  వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ కృష్ణానది వద్ద ఓ డెడ్ బాడీ లభ్యమైంది. గుర్తు తెలియని డెడ్ బాడీ అంటూ పలు వట్సాప్ గ్రూపుల్లో హల్ చేయడంతో పెబ్బేరు పోలీసులు స్పందించి వివరాలు సేకరించారు. పెబ్బేరు ఎస్సై జగదీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం వామనపల్లికి చెందిన బోయ రాములు(52) మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. అయినా మద్యం మానలేదు. ఇంట్లో వాళ్లు ఎన్నోసార్లు మద్యం మానేయాలని గొడవపడినా వినలేదు.

ఈనెల 16న మరో సారి గొడవపడి గద్వాలకు వెళ్తానని ఇంట్లో చెప్పి పెబ్బేరు మండలం రంగాపూర్ వద్ద ఉన్న కృష్షానది పుష్కర్ ఘాట్ వద్దకు వచ్చి మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి అక్కడే మరణించాడు. నిర్మానుష్య ప్రాంతం కావడంతో దుర్వాసన రావడాన్ని గుర్తించిన కొందరు ఫొటో తీసి వాట్లాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో శుక్రవారం విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి డెడ్బాడీని వారికి అప్పగించారు. మృతుడి తమ్ముడు గోవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.