నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి.. జగన్ పై దాడి కేసులో పోలీసు కమిషనర్ కీలక ప్రకటన
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర లో సీఎం జగన్ పై కొందరు ఆగంతకులు రాళ్ల దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఇష్యూను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి ఎలా జరిగింది? ఎయిర్ గన్ తో దాడి చేశారా? లేదంటే క్యాట్బాల్తో కొట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే రాళ్ల దాడి చేసిన నిందుతలను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఈ సన్నివేశాలను బంధించిన వారు నేరుగా వచ్చి తమకు అందిస్తే రూ. 2 లక్షలు ఇస్తామని, వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు.