రామున్ని అవమానిస్తే సజీవ దహనానికి సిద్ధం

రామున్ని అవమానిస్తే సజీవ దహనానికి సిద్ధం
  • మందు, మాంసం లేకుండా బండి ఉండలేడు
  • తల్లిని అవమానిస్తున్న బండిపై బీజేపీ అధిష్టానం సమాధానం చెప్పాలి
  • నా దయ దక్షిణ్యాలపై అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యావు
  • మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీ కి ఎందుకు రాజీనామా చేయలే
  • రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :అయోధ్య రామున్ని అవమానించినట్లు నిరూపిస్తే సజీవ దహనానికి సిద్ధం అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తల్లి జన్మపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు. నవ మాసాలు మోసిన నా తల్లిని అవమానిస్తావా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఎంపీగా గెలిచి ఏం అభివృద్ధి చేశావని ప్రశ్నించానని అన్నారు . అయితే నన్ను ఉద్దేశించే నా తల్లిని అగౌరవపరుస్తూ బండి వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టం చేశారు. అయినా సహనంతో భరించానని తెలిపారు. మళ్లీ హుస్నాబాద్ చౌరస్తాలో పొన్నం ప్రభాకర్ తల్లిని రాజకీయాలకు వాడుకుంటున్నాడని ఆ తల్లి ఆత్మ శోభిస్తుందని అనడం బండి చేస్తున్న చిల్లర రాజకీయాలకు నిదర్శనం అన్నారు.

దీనిపై బిజెపి అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలన్నారు. రాముడిని అవమానిస్తున్నారని ఒకసారి, అక్షింతలపై మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. నికార్సైన హిందువునని ప్యూర్ వెజిటేరియన్ అని స్పష్టం చేశారు. మాంసం, మందు లేకుండా ఉండలేని బండి సంజయ్ నాపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు. ఎంపీగా గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని ప్రశ్నిస్తున్న బండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన నువ్వు ఎంపీ పదవికి ఎందుకు రాజీనామాచేయలేదని ప్రశ్నించారు. నీకంటే ముందే ఎంపీ తో పాటు పలు ఉన్నత పదవులు చేపట్టానని చెప్పారు. నా దయాదాక్షిన్యాలపై అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యావని ఎద్దేవా చేశారు. ఇకనుండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జాగ్రత్త అంటూ హెచ్చరించారు.