సీఐ వేధింపులు.. వ్యాపారి ఆత్మహత్య?

సీఐ వేధింపులు.. వ్యాపారి ఆత్మహత్య?

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : సీఐ వేధింపులతో వ్యాపారి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం  గ్రామానికి చెందిన బొడిగె శ్యామ్ అలియస్ బొడిగే సాంబయ్య స్థిరాస్తి వ్యాపారి. కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగంలో సీఐగా పనిచేస్తున్న గోపాలకృష్ణ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య భూ వివాదం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. సిఐ గోపాలకృష్ణ వేధిస్తున్నట్లు తెలుపుతున్న ఫోన్ కాల్ ఆడియో సంభాషణ వైరల్ గా మారింది.