ప్రతిపక్షాల తీరు హేయం - బిజెపి

ప్రతిపక్షాల తీరు హేయం - బిజెపి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:దేశ ఉప రాష్ట్రపతి జగ దీప్ ధన్కర్ ను హేళన చేస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్ ఎదుట వ్యవహరించిన తీరు హేయమని బిజెపి జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిష్టాత్మక హోదాలో ఉన్న ఉప రాష్ట్రపతిని హేళన చేయటం రాజ్యాంగాన్ని, అత్యున్నత పదవిని అవమానించటమే నన్నారు. ఈ వైఖరి సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు సాదం అరవింద్, రాజేశ్వర్ రెడ్డి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.