BREAKING:  మరో మోసానికి తెరతీసిన రేవంత్ రెడ్డి: కేటీఆర్

  • రైతుబంధు అమలు చేయలేనివాడు.. 40 వేల కోట్ల రుణమాఫీ ఎలా చేస్తాడు

ముద్ర, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త మోసానికి తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోసం పార్ట్-1 చేశారు. ఇప్పుడు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తానంటూ మోసం పార్ట్ -2కు తెరతీశారని ఆయన అన్నారు. రైతుబంధును సక్కగా అమలు చేయని ఆయన, 40 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తాడా అని ప్రశ్నించార. ఒక్కసారి మనిషి చేతిలో మోసపోతే మోసం చేసినవాడిది తప్పు... రెండవసారి కూడా అదే మనిషి చేతిలో మోసపోతే తప్పు మనదే అవుతుందని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ చేస్తానంటే నమ్మడానికి మనమేమైనా పిచ్చోళ్లమా అని ప్రశ్నించారు. రైతులంతా ఆలోచించుకోవాలని ఆయన కోరారు.