బీఆర్ఎస్ సిట్టింగ్లకు కీలక పదవులు
- ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి.. రైతుబంధు చైర్మన్గా తాటికొండ
- నందికొండ శ్రీధర్, ఉప్పలకు ఇతర పదవులు
- ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్పార్టీలో ఇద్దరు సిట్టింగ్ఎమ్మెల్యేలకు కీలక పదవులు వరించాయి. ఈసారి ఎన్నికల్లో స్టేషన్ఘన్పూర్, జనగామ సెగ్మెంట్లలో ఇద్దరు సిట్టింగ్లకు టికెట్లు మార్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్వారికి కొత్త పదవులను సర్దుబాటు చేశారు. అసంతృప్తితో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్యను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమిస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ చైర్మన్గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని నియమించారు. జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్రెడ్డికి టికెట్కేటాయించారు. మరోవైపు స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు రైతుబంధు కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ సెగ్మెంట్టికెట్ను కడియం శ్రీహరికి కేటాయించిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్నుంచి ఇటీవల బీఆర్ఎస్లో చేరిన నందికొండ శ్రీధర్కు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా, మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఉప్పల వెంకటేశ్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.