ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ముద్ర.వీపనగండ్ల:-ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠినచర్యలు తప్పవని ఎస్సై నందికర్ హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని తూముకుంట వాగు నుంచి అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని తాసిల్దార్ కు సమాచారం రావడంతో కార్యాలయ సిబ్బందిని పంపి ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించినట్లు తెలిపారు. తూముకుంట గ్రామానికి చెందిన బంకల సుధాకర్, నల్లబోతుల రామకృష్ణలకు చెందిన రెండు ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాలలో ఎవరికైనా ఇసుక అవసరమైతే ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని లేదా తాసిల్దార్ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు.