శ్రీ మల్లన్న స్వామి వారి జాతర మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

శ్రీ మల్లన్న స్వామి వారి జాతర మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
 ముద్ర, కోరుట్ల: కథలపూర్ మండలం ఊట్పల్లి గ్రామంలోని శ్రీ మల్లన్న స్వామి వారి జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు. అనంతరం గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు.