సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ బదిలీ

సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ బదిలీ
  • డైరెక్టర్ బలరాం కు సిఎండిగా అదనపు బాధ్యతలు


ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:-ఎట్టకేలకు సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న బలరాం కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సిఎండిగా అదనపు బాధ్యతలు సోమవారం అప్పగించారు. 2015. జనవరి ఒకటవ తేదీన సీఎండీ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ పై అనేక ఆరోపణలు వచ్చాయి, సింగరేణి లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని   అవినీతిలో సీఎండీ శ్రీధర్ పాత్ర ఉందని ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ, అప్పటి తెలంగాణ ప్రభుత్వం శ్రీధర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మొన్న జరిగిన సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ గుర్తింపు సంఘం గా గెలుపొందడంతో బదిలీలు ఖాయం అనుకుంటున్న సందర్భంగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం సీఎండీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సింగరేణి సీఎండి బలరాం