పాము కాటుతో విద్యార్థి మృతి చేయుత నీచ్చిన ఎంప్లైస్ యూనియన్
మోత్కూర్,ముద్ర: మండలం లోని దత్తప్పగూడెం ముక్కెర్ల కుమార్ మమతల కుమారుడు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ పదవ తరగతి విద్యార్థి ముక్కర్ల ఉమేష్ గత నెల 27 న అర్ధరాత్రి సమయంలో పాముకాటుతో మృతి చెందడం జరిగింది. ఉమేష్ తల్లిదండ్రులు శోకసంద్రంలోమునిగిపోయారు. మంచి భవిష్యత్తు ఉన్న కుమారుడు చేతులకు అంద వచ్చిన కుమారుని జీవితంలో పాము విషం చిమ్మింది. విద్యార్థి భవిష్యత్తును చీకటి కమ్మింది.
ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. చదువుకునే విద్యార్థి చిన్నతనములోనే అనుకోని సంఘటనతో చనిపోవడం వలన దత్తప్పగూడెం ఎంప్లాయిస్ క్లబ్ గౌరవ సభ్యులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ హృదయ విదారక సంఘటనకు ఎంప్లాయిస్ క్లబ్ సభ్యులంతా స్పందించి తల్లిదండ్రులకు ఊరట కలిగించడం కోసం ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయంను క్లబ్ అధ్యక్షులు తొంట కృష్ణ, ప్రధాన కార్యదర్శి వల్లపు బిక్షం, అందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సభ్యులు పాల్గొన్నారు.