కంటతడి పెట్టుకున్న సుంకె రవిశంకర్...

కంటతడి పెట్టుకున్న సుంకె రవిశంకర్...
  • ప్రజాతీర్పును గౌరవిస్తాం
  • బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

ముద్ర,చొప్పదండి:నేను ఓడిపోయినప్పటికీ కేసిఆర్ లేని తెలంగాణ ను ఊహించుకోవడం చాలా బాధగా ఉందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కంటతడి పెట్టుకున్నారు.గంగాధర మండలం బూరుగుపల్లి తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2018 అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎమ్మెల్యే గా గెలుపొందానని మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని గుర్తు చేసుకున్నారు.రెండు సంవత్సరాలు కరోనా,ఒక సంవత్సరం ఆర్థిక మాంద్యం ఉన్న అభివృద్ధి చేశానని అన్నారు. ఈ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.