మంత్రి జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ విజయంతో   సంబరాలు జరుపుకున్న బిఆర్ ఎస్ పార్టీ 44,45 వార్డు నాయకులు

మంత్రి జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ విజయంతో   సంబరాలు జరుపుకున్న బిఆర్ ఎస్ పార్టీ 44,45 వార్డు నాయకులు
  • తెలంగాణ తల్లి విగ్రహం వద్ద  బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న నాయకులు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట అభివృద్ధి ప్రధాత, విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించడంతో బిఆర్ ఎస్ పార్టీ నాయకులు బండారు రాజా, చల్లా లక్ష్మికాంత్ ఆధ్వర్యంలో 44,45 వార్డు నాయకులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట లో తనకు తిరుగులేదని మంత్రి జగదీష్ రెడ్డి మరొకసారి నిరూపించారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మైనారిటీ నాయకులు సయ్యద్ సలీం, పార్టీ నాయకులు బైరు వెంకన్న,  కలకోట లక్ష్మయ్య, చల్లా లక్ష్మిప్రసాద్, రాచర్ల కమలాకర్, ముప్పారపు నాగేశ్వరరావు, మిట్టపల్లి రమేష్, వార్డు అధ్యక్షులు కుక్కడపు సాలయ్య, రషీద్, గుణగంటి సతీష్, పబ్బా ప్రకాష్, లతీఫ్, కుక్కడపు క్ర్రష్ణ, వాంకుడోతు మురళి, రాపర్తి రవి, అనంతుల శ్రీనివాస్, ఇస్రార్ అహ్మద్, కీర్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.