కర్నాటక సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది
కర్నాటక సీఎం పదవిపై మద్దతుదారులతో చర్చించిన కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్. సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. పీసీసీ చీఫ్గా 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానని అన్నారు. పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు. 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ధైర్యం కోల్పోలేదని చెప్పారు.
పార్టీ నేతలను ఏకతాటిపైకి తెచ్చానని చెప్పారు. తాను ఒంటరిగానే పార్టీని గెలిపించుకున్నానన్నారు. సోనియా, రాహుల్, ఖర్గే సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తన మద్దతుదారుల సంఖ్య ఇంతని చెప్పనని అన్నారు. మా సంఖ్య అంతా కాంగ్రెస్ సంఖ్యే అన్నారు.