రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం
  • చంద్రగిరి వద్ద ఘోర ప్రమాదం
  • మృతులు నెల్లూరు వాసులుగా పోలీసుల గుర్తింపు

ముద్ర వార్తలు, ఆంధ్రప్రదేశ్:  ప్రముఖ యాత్రాస్థలం తిరుపతికి సమీపంలోని చంద్రగిరి వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. చంద్రగిరి సమీపంలోని కొంగరవారిలపలె వద్ద కారు అదుపు తప్పి కల్వర్లును ఢీకొట్టింది. ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే నలుగురు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. వీరంతా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో బెంగళూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో చనిపోయిన వారు నెల్లూరు జిల్లాకు చెందిన వారిని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.