టీడీపీ మాజీమంత్రి సీతాదేవి కన్నుమూత

టీడీపీ మాజీమంత్రి సీతాదేవి కన్నుమూత

TDP Former Minister  : ముద్ర, ఆంధ్రప్రదేశ్:  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గతంలో మంత్రిగా పనిచేసిన, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి గుండెపోటుతో సోమవారం మృతి చెందారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆమె ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. సీతాదేవి స్వస్థలం ఏలూరు జిల్లాలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 1985,1994 లో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆమె గెలిచారు. నాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు  మంత్రివర్గంలో ఆమె విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆమె మృతిపై తెలుగుదేశం నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.