భైంసా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం

భైంసా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా మండల అధ్యక్ష ఉపాధ్యక్ష పదవుల ఎన్నిక శుక్రవారం ఏకగ్రీవంగా జరిగింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ముథోల్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బైంసా ఎంపీపీ జాదవ్ కల్పన గణేష్, ఉపాధ్యక్షులు గాజుల గంగాధర్  తమ పదవులకు రాజీనామ చేశారు.

ఈ మేరకు శుక్రవారం భైంసా మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్  అధ్యక్షతన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షునిగా మహ్మద్ అబ్దుల్ రజాక్, ఉపాధ్యక్షులుగా అంగోళ్ళ నర్సారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. ఈ సందర్భంగా వారు నిష్పక్షపాతంగా మండల అభివృద్ధికి తమ వంతుగా శాయశక్తులా కృషి చేస్తామని ప్రమాణం చేశారు. మైనింగ్ ఏ డీ క్రాంతి కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఇందులో ఆయా గ్రామాల సర్పంచులు, జడ్పీటీసీ లు, ఎంపీటీసీలు, మాజీ  ఎంపీపీ లు బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు.