రేపు మంథనికి వస్తున్న మంత్రి శ్రీధర్ బాబుకు నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలకాలి

రేపు మంథనికి వస్తున్న మంత్రి శ్రీధర్ బాబుకు నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలకాలి
  • మంథని ఎంపీపీ కొండ శంకర్ 

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: మంథని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి...తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఆదివారం మంథని నియోజక వర్గానికి వస్తున్న గుద్దిల శ్రీధర్ బాబు కు నియోజకవర్గ ప్రజలతో పాటు మంథని మండల కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలుకాలని మంథని ఎంపీపీ కొండ శంకర్ ఒక ప్రకటనలో కోరారు.  

   
మంథని సర్వసభ్య సమావేశంలో సమావేశం లో పాల్గొననున్న మంత్రి    

మంథని మండల సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించనున్నట్లు మంథని ఎంపీపీ కొండ శంకర్,  ఎంపీడీవో రమేష్ లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా ఐటీ, పరిశ్రమల శాఖ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొననున్నట్లు ఆయన  తెలిపారు. సమావేశానికి ఎంపీటీసీలు సర్పంచులు అన్ని శాఖల జిల్లా డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొని మండల సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.