గురుకుల విద్యార్థి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి :బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని మేడి

గురుకుల విద్యార్థి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి :బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని మేడి

రామన్నపేట, ముద్ర : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై మృతి చెందిన ఆరో తరగతి చదువుకునే విద్యార్థి ప్రశాంత్ కుటుంబాన్ని రాష్ట్రప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని మేడి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇటీవల గురుకుల పాఠశాలలో తరచూ ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించడం లేదని, ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని అన్నారు, మృతి చెందిన విద్యార్థి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలన్నారు.