మున్నూరుకాపు సంఘం యువజన విభాగం కరీంనగర్ జిల్లా కన్వీనర్ గా తోట కోటేశ్వర్

మున్నూరుకాపు సంఘం యువజన విభాగం కరీంనగర్ జిల్లా కన్వీనర్ గా తోట కోటేశ్వర్

గన్నేరువరం ముద్ర న్యూస్: గత కొంతకాలంగా మున్నూరుకాపు సంఘంలో క్రియాశీలకంగా నిర్వహించే కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న తోట కోటేశ్వర్ పటేల్ ను తెలంగాణ మున్నూరుకాపు సంఘం యువజన విభాగం కరీంనగర్ జిల్లా కన్వీనర్ గా నియమకం చేశారు. తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ సూచన మేరకు, తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ పటేల్ తోట కోటేశ్వర్ ను నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తోట కోటేశ్వర్ పటేల్ మాట్లాడుతూ నియామకానికి సహకరించిన కొండ దేవయ్య, హరిశంకర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.