గ్రూప్-1 పోస్టుల భర్తీ దరఖాస్తుకు నేడే లాస్ట్ ఛాన్స్

గ్రూప్-1 పోస్టుల భర్తీ దరఖాస్తుకు  నేడే లాస్ట్ ఛాన్స్

ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అప్లికేషన్లకు గడువు ఈ నెల 14నే ముగిసినా.. టీఎస్పీఎస్సీ రెండు రోజులు పొడిగించిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేసుకోవాలని సూచించింది. గత నెల 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది.