యాదాద్రి పులిహోర ప్రసాదంలో చచ్చిన ఎలుక ప్రత్యక్షం

యాదాద్రి పులిహోర ప్రసాదంలో చచ్చిన ఎలుక ప్రత్యక్షం

ముద్ర,యాదాద్రి భువనగిరి:- యాదాద్రి లక్ష్మీనర్సింహ్మ స్వామి ప్రసాదంలో చచ్చిన ఎలుక రావడం కలకలం రేపుతోంది. ఆలయంలో ఓ భక్తుడు స్వామి వారి దర్శనానంతరం.. పులిహోర ప్యాకెట్‌ను కొన్నాడు. ప్రసాదం తిందామని ప్యాకెట్ ఓపెన్ చేయగానే.. చచ్చిన ఎలుక దర్శనమిచ్చింది. దీంతో అతను ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ప్రసాదంలో చచ్చిన ఎలుక రావడంతో అక్కడ ఉన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆలయ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.