నూతన సంవత్సర ఉగాది సందర్బంగా ఎమ్మెల్యే ని ఆశీర్వదించిన వేదపండితులు

నూతన సంవత్సర ఉగాది సందర్బంగా ఎమ్మెల్యే ని ఆశీర్వదించిన వేదపండితులు

జోగులాంబ గద్వాల్ ముద్ర పప్రతినిధి: ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కి శ్రీ శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను మల్దకల్ దేవాలయ వేద పండితులు వేద మంత్రాలతో శాశ్రోత్తంగా దీవించి ఎమ్మెల్యే కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా  ఉగాది నామ సంవత్సరంలో కెసిఆర్. సహకారంతో గద్వాల నియోజకవర్గ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి వ్యాపారాలు విద్యా వైద్య దినదిన అభివృద్ధి చెందాలి.

ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాక్స్ ఛైర్మన్ తిమ్మారెడ్డి, ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, సర్పంచ్ యాకోబు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు అజయ్, నరేందర్ మధు నాయకి, తిమ్మరాజు, మల్దకల్, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.