వెంకిర్యాలలో విమాన గోపురం, ఆంజనేయ స్వామి ఆలయం ప్రారంభం

వెంకిర్యాలలో విమాన గోపురం, ఆంజనేయ స్వామి ఆలయం ప్రారంభం

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: బీబీనగర్ మండలంలోని వెంకిర్యాలలో వేంచేసివున్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో పునర్నిర్మాణం చేసిన విమాన గోపురం, నూతన ఆంజనేయ స్వామి ఆలయం, ధ్వజస్తంభ  ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం వైభవోపేతంగా జరిగింది. ఆలయ చైర్మన్ దంపతులు రాచమల్ల లక్ష్మీ పద్మావతి శ్రీనివాసులు, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో శ్రీ త్రిడండి రామానుజ దేవనాథ జీయర్ స్వామి శ్రీహస్తాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి, సహాయ కమిషనర్ మహేంద్ర కుమార్, మత్స్యగిరి కార్యనిర్వహణాధికారి మోహన్ బాబు, ఎంపీపీ ఎర్కల సుధాకర్ గౌడ్, జడ్పీటీసీ గోలి ప్రణీత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి పింగళ్ రెడ్డి, రైతు బంధు కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డిలతో పాటు పెద్దఎత్తున గ్రామస్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.