బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రూ.10 వేల జరిమానా విధించిన హైకోర్టు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రూ.10 వేల జరిమానా విధించిన హైకోర్టు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న  బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ.10వేల జరిమానా విధించింది. 2018 ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులను చూపకుండా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గొంగిడి సునీత ఎన్నిక చెల్లదని సైని సతీశ్​కుమార్ అనే వ్యక్తి  కోర్టులో పిటిషన్ వేశారు. ఇంప్లీడ్ అయిన ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్యారెడ్డి.. 2018కి చెందిన కేసులో ఇప్పటివరకూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  అక్టోబరు 3వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఎమ్మెల్సీ సునీతను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.