లయన్ వినయ్ కు విశ్వ గురు పురస్కారం

లయన్ వినయ్ కు విశ్వ గురు పురస్కారం

ముద్ర విలేకరి ,రాజేంద్రనగర్: మణికొండ, హైదర్ షాకోట్ ప్రాంతాలలో విశేషంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ నవభారత్ అధ్యక్షుడు బి వి ఎస్ రావు ( బి. వినయ్) కు ఉగాది పురస్కారం లభించింది. ప్రతి ఏటా వివిధ రంగాల్లో విశేషమైన సేవలను అందిస్తున్న వారికి లయన్ సత్యవోలు రాంబాబు నేతృత్వంలో ప్రతి ఏటా విశ్వగురు ఉగాది పురస్కారాలు అందజేస్తూ వస్తున్నారు.

ఈ ఏడాది ఉగాది సందర్భంగా ఈ అవార్డును అందుకున్న వారిలో వినయ్ ఒకరు. జస్టిస్ సుధ, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మదన్ మోహన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఇద్దరు అనాధ యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించడం, హైదర్ షాకోట్ లోని కస్తూర్బా వృద్ధాశ్రమంలో తరచూ వివిధ సేవా కార్యక్రమాలను, ఉచిత వైద్య శిబిరాలను వినయ్ నిర్వహించారు. మణికొండ ప్రాంతంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న వినయ్ మాస్టర్ గేమ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ గా కూడా సేవలందిస్తున్నారు. ఈ అవార్డును అందుకున్న సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు  అభినందనలు తెలిపారు.