టవర్ క్లాక్ వద్ద రాళ్లు, చెప్పులతో దాడి చేసుకున్న వైసీపీ, టీడీపీ

టవర్ క్లాక్ వద్ద రాళ్లు, చెప్పులతో దాడి చేసుకున్న వైసీపీ, టీడీపీ

అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద వైసీపీ, టీడీపీ వర్గీయులు రాళ్లు, చెప్పులతో దాడి చేసుకున్నారు. టవర్ క్లాక్ వద్దకు చేరుకున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త హరికృష్ణా రెడ్డి చేరుకున్నారు. ఈ క్రమంలోనే పరిటాల అభిమానులు పోలీసుల అదుపులో ఉన్న హరికృష్ణరెడ్డి పై చెప్పులతో  దాడికి దిగారు. దీంతో వైసీపీ కార్యకర్తలు సైతం, టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య రాళ్లు, చెప్పుల దాడి జరిగింది.  వైసీపీ కార్యకర్తల దాడిలో టీడీపీ కార్యకర్త, కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్తను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.  టవర్ క్లాక్ వద్ద నేటి ఉదయం నుంచే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పరిటాల కుటుంబం పై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సవాళ్లు... పరిటాల అభిమానుల ఆందోళనలతో టవర్ క్లాక్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిటాల కుటుంబాన్ని ఉద్దేశించి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త హరి  అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతపురం  టవర్ క్లాక్ వద్దకు వస్తానంటూ సవాల్ విసిరారు. బెంగళూరు నుంచి వస్తూ మార్గం మధ్యలో రాప్తాడు టీడీపీ కార్యాలయం , జాకీ పరిశ్రమ భూముల వద్దకు వెళ్లిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త.. టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ కార్యాలయం దేవాలయ భూముల్లో, జాకీ పరిశ్రమ నుంచి రూ.50 కోట్లు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. హరి సవాల్‌తో పరిటాల అభిమానులు, టీడీపీ కార్యకర్తలు టవర్ క్లాక్ వద్దకు చేరుకున్నారు. ఆ తరువాత హరికృష్ణారెడ్డి అక్కడి చేరుకోవడంతో గొడవ ముదిరి పాకాన పడింది.