లక్ష్మణ చాంద లో హరిత దినోత్సవం

లక్ష్మణ చాంద లో హరిత దినోత్సవం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సోమవారం లక్ష్మణ చాంద మండల కేంద్రంలో హరిత దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని కే జీ వి బి కళాశాల లో, సహకార జూనియర్ కాలేజి లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాల్గొన్న పలువురు అధికారులు, నేతలు మాట్లాడుతూ మొక్కల పెంపకం వల్ల కలిగే ఉపయోగాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటిసి ఒస రాజేశ్వర్, తహసిల్దార్ కవిత,ఎంపిడిఓ శేఖర్, కేజివి బి ప్రత్యేకాధికారి నవిత తదితరులు పాల్గొన్నారు.