ఖానాపూర్ లో కలెక్టర్ పర్యటన

ఖానాపూర్ లో కలెక్టర్ పర్యటన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో కలెక్టర్ వరుణ్ రెడ్డి బుధవారం ఉదయం దాదాపు మూడు గంటల పాటు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం తహశీల్దారు కార్యాలయాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రి ని సందర్శించి రోగులతో మాట్లాడి సౌకర్యాలను గురించి తెలుసుకున్నారు.పట్టణంలో జరుగుతున్న విస్తరణ పనులను పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాజేందర్ తదితరులున్నారు.