వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

హుజూర్నగర్, ముద్ర:వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ అన్నేం శిరీష కొండారెడ్డి అన్నారు.బుధవారం మండల పరిధిలోని వేపల సింగారంలో వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. గ్రామపంచాయితీ వద్ద మండల వైద్య బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ లో జ్వరాలు,కాళ్ళనొప్పులు,కీళ్ళవాపులు ఉన్నవారికి రక్త పరీక్షలు  చేసి ఉచిత మందులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో మండల వైద్యాధికారిని డాక్టర్ సన, ఆరోగ్య విస్తరణ అధికారి గజగంటి ప్రభాకర్,వైద్య సిబ్బంది ఉదయగిరి శ్రీనివాస్ ఏఎన్ ఎం సావిత్రి, అలివేలుమంగ, ఆశ కార్యకర్తలు, సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.