జేవీఎన్ ఆర్ పాఠశాలలో రక్షా బంధన్ వేడుకలు

జేవీఎన్ ఆర్ పాఠశాలలో రక్షా బంధన్ వేడుకలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ పట్టణం జేవీఎన్ ఆర్ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులచే ఎకో ఫ్రెండ్లీ రాఖీల తయారీ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గోపాల్ కిషన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.