వైసీపీ కి అంబటి రాయుడు గుడ్ బై
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్సీపీకి మరొకరు షాక్ ఇచ్చారు. పార్టీని వీడుతున్నట్లు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా’’ అని తెలిపారు. ఇటీవలే సీఎం జగన్ సమక్షంలో అంబటి రాయుడు వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. అంతక ముందు ముఖ్యమంత్రి వైఎష్ జగన్ పాలనపై ప్రశంసలు కురిపిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.