గజ్వేల్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన అంజిరెడ్డి

గజ్వేల్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన అంజిరెడ్డి

ముద్ర ప్రతి నిధి, సిద్దిపేట : గజ్వేల్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం గురించి ముఖ్యమంత్రి కేసిఆర్ ను మెదక్ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు.ఎర్ర వల్లిలోని ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను శనివారం నాడు అంజిరెడ్డి కలిశారు. గజ్వేల్ నియోజకవర్గం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, దళిత బంధు, ఆర్ అండ్ ఆర్ కాలనీల సమస్యల గురించి ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించాలని కోరారు,ముఖ్యమంత్రి  సానుకూలంగా స్పందించి అతి త్వరలో గజ్వేల్ కు సంబందించిన అన్ని పనులు చేసుకుందామని, తెలపడం జరిగిందని, ఏ సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకోని వచ్చి పరిష్కరించుకోవాలనిచెప్పినట్టు బట్టు అంజిరెడ్డి తెలిపారు, ఇప్పటికే గజ్వేల్ ను అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి  మరింత అభివృద్ధి సంక్షేమ పతకాలను గజ్వేల్ లో అమలు చేసి ప్రజలకు మరింత మేలు జరిగేలా చూస్తారన్నారు.