డబల్ బెడ్ రూం గృహ సముదాయం లో గ్రామదేవత నిర్మాణానికి శంకుస్థాపన ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి.
![డబల్ బెడ్ రూం గృహ సముదాయం లో గ్రామదేవత నిర్మాణానికి శంకుస్థాపన ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి.](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64849b2e7dde5.jpg)
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఆసుపత్రి సమీపంలోని గొల్లబజార్ వద్ద మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన డబల్ బెడ్ రూం గ్ర్రహ సముదాయం నందు శనివారం నాడు గ్రామదేవత బంగారు మైసమ్మ ఆలయ నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతులమీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు మొరిశెట్టి శ్రీనివాస్, ఉప్పల ఆనంద్, ఎల్గూరి రమా కిరణ్, ఎండి తహేర్, గ్ర్రహ సముదాయం యజమానులు గోగుల వెంకట్, వీరాచారి, శైలేందర్, వెంకన్న, రవ్వ రాంబాబు, అరవింద్, విడెం శ్రీను, సతీష్, రాజేష్ , మహిళలు తదితరులు పాల్గొన్నారు.