ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు

ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21 నుంచి నాలుగు రోజుల పాటు అమెరికా టూర్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పర్యటన చరిత్రలో నిలిచిపోతుందని అమెరికా అధికారులు సంబరపడిపోవడం విశేషం. ఈ పర్యటనలో జూన్ 22న మోడీకి రాష్ట్ర విందులో బైడెన్​ఆతిథ్యం ఇవ్వనున్నారు. అమెరికా, భారత్‌ల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రధాని మోడీ పర్యటన దోహదం చేయనుంది. మరోవైపు రక్షణ రంగంలో పలు కొనుగోళ్లపై ఒప్పందాలు కూడా చేసుకోనున్నట్లు కేంద్ర పీఎంఓ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.