అశ్విన్​పై ప్రశంసల వర్షం

అశ్విన్​పై ప్రశంసల వర్షం

వెస్టిండీస్​: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టు మొదటి రోజు ఎంవీపీ టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అని చెప్పాలి. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అతను.. తను వేసిన మూడో ఓవర్లోనే టగనరైన్ చందర్‌పాల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తన డిఫెన్స్‌ను ఆ బంతి ఎలా బీట్ చేసిందో కూడా అతనిక అర్థం కాలేదు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఆ తర్వాత కాసేపటికే విండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్‌ను కూడా అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. ఇక ఆ తర్వాత విండీస్ మిడిలార్డర్‌ను కూడా తన బంతితో సమాధి చేశాడు. ఈ క్రమంలోనే ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకొని, ఇది అశ్విన్ కెరీర్‌లో 33వ ఐదు వికెట్ల హల్ కావడం గమనార్హం. విండీస్ టీమ్‌లో ఫర్వాలేదనిపించిన అథనాజ్ (47)ను కూడా అశ్విన్ అవుట్ చేశాడు.

అతని బౌలింగ్ చూసిన ఫ్యాన్స్ షాకైపోయారు. ఇంత సూపర్‌గా బౌలింగ్ చేస్తున్నాడేంటి? అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో ఇలాంటి స్పిన్నర్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి కీలకమైన మ్యాచ్‌లో రోహిత్ పక్కన పెట్టాడని ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే నెట్టింట రోహిత్‌పై విమర్శల వెల్లువ కురుస్తోంది. పిచ్ అంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన రోహిత్.. అశ్విన్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడించలేదని అంటున్నారు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ అద్భుతంగా రాణించాడు. ఇది చూసిన వాళ్లు రోహిత్‌ను మరింత ఎక్కువగా విమర్శించారు. ఇక మాజీ క్రికెటర్లు, ప్రముఖ కామెంటేటర్లు కూడా అశ్విన్ బౌలింగ్‌పై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. విండీస్ సిరీస్ కోసం చక్కగా రెడీ అయిన అతను.. మిగతా బౌలర్లలా మరీ వేరియేషన్స్ జోలికి పోలేదు. సంప్రదాయ బద్ధ డెలివరీలతోనే విండీస్‌ను ఓడించేందుకు రెడీ అయ్యాడు. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో అశ్విన్‌ను తెగ మెచ్చుకుంటున్నారు.