పాకిస్థాన్ లో దారుణం.. హిందూ వైద్యుడి గొంతు కోసి హత్య

పాకిస్థాన్ లో దారుణం.. హిందూ వైద్యుడి గొంతు కోసి హత్య

పాకిస్థాన్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్‌ (పాక్ లోని నగరం)కు చెందిన ప్రముఖ చర్మవ్యాధుల నిపుణుడు డా. ధరమ్‌దేవ్ రాఠీని ఆయన డ్రైవర్ మంగళవారం గొంతు కోసి చంపేశాడు. ఆ మరుసటి రోజే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కారులో ఇంటికి వస్తుండగా డా. ధరమ్‌దేవ్‌కు, డ్రైవర్‌కు మధ్య గొడవ జరిగినట్టు ధరమ్‌దేశ్ ఇంట్లోని వంటమనిషి పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలో వైద్యుడు ఇంట్లోకి వచ్చాక డ్రైవర్ వంటగదిలోని కత్తి తీసుకుని ఆయన గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత ధరమ్‌దేవ్ కారులోనే అక్కడి నుంచి ఉడాయించాడు.