బోగస్ ఓట్ల వ్యవహారం ఢిల్లీకి నేడు సీఈసీకి ఫిర్యాదు

బోగస్ ఓట్ల వ్యవహారం ఢిల్లీకి నేడు సీఈసీకి ఫిర్యాదు

ముద్ర ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ నియోజకవర్గంలో వెలుగు చూసిన బోగస్ ఓట్ల వ్యవహారం ఢిల్లీకి చేరింది.  బీజేపీ నేతలు ప్రైవేట్ ఏజెన్సీలతో జరిపించిన సర్వేలో భారీగా బోగస్ ఓట్ల నమోదు భాగోతం వెలుగు చూసింది. దీంతో ఆ పార్టీ నేతలు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల సంఘం ఈ అంశంపై విచారణ నిమిత్తం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ నేతలు రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 3గంటలకు అపాయింట్మెంట్ లభించిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ రోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.