అనుమానాస్పద పరిస్థితుల్లో యువకుని మృతి
![అనుమానాస్పద పరిస్థితుల్లో యువకుని మృతి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_643e5f0aebe9f.jpg)
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని బోయివాడ కు చెందిన చరణ్ కుమార్(30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శరీరంపై గాయాలతో మృతదేహం మంగళవారం లభ్యమైంది. వివరాలిలా వున్నాయి. స్థానిక బోయివాడకు చెందిన జేష్టం చరణ్ కుమార్ (30) సోమవారం ఉదయం పనిమీద ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. కాగా ఆ యువకుని మృతదేహం అదే కాలనీలో రోడ్డు ప్రక్కన పడి ఉండటం స్థానికులు గమనించారు. దీంతో సిఐ మల్లేష్ నేతృత్వంలో కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రధానాసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా ఈ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖంపై గాయాలు ఉండడంతో ఎవరో చంపి పడవేశారని వారు ఆనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనలో న్యాయం జరిగేలా చూడాలని వారు పోలీసులను కోరారు.