గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి - కుటుంబ సభ్యులను పరామర్శించిన ‘పల్లా’

గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి - కుటుంబ సభ్యులను పరామర్శించిన ‘పల్లా’

ముద్ర ప్రతినిధి, జనగామ : బీఆర్‌‌ఎస్‌ 16వ వార్డు అధ్యక్షుడు కాసార్ల శంకర్ గుండె పోటుతో మరణించారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల ఆయనకు గుండె పోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. కాగా, తమ కార్యకర్త మరణ వార్త తెలుసుకున్న బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి ఉదయం శంకర్‌‌ ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి నిళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పల్లాతో పాటు బీఆర్‌‌ఎస్‌ లీడర్లు ఉడుగుల కిష్టయ్య, ఉడుగుల నర్సింహులు, మల్లిగారి రాజు, పానుగంటి ప్రవీణ్‌, నర్ర ప్రవీణ్ తదితరులు శంకర్‌‌ మృతదేహానికి నివాళులర్పించారు.