బిఆర్ఎస్ పార్టీలోకి  కిషన్ రావుపేట గ్రామస్థుల చేరిక..

బిఆర్ఎస్ పార్టీలోకి  కిషన్ రావుపేట గ్రామస్థుల చేరిక..

వెల్గటూర్, ముద్ర : వెల్గటూర్ మండలం లోని కిషన్ రావుపేట గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్,  బీజేపీ పార్టీలకు సంబందించిన నాయకులు, యువకులు  ధర్మపురి లో గల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీలో చేరగా,  మంత్రి కొప్పుల ఈశ్వర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధికి చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.  కొప్పుల ఈశ్వర్  గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పొనుగోటి విజయ రంగారావు, సర్పంచ్ మెరుగు కొమ్మురయ్య, ఉపసర్పంచ్ పుదారి రాజేందర్, గ్రామశాఖ అధ్యక్షులు బోగే రాజయ్య, యూత్ అధ్యక్షులు నైనాల అజయ్, అల్గునూరి సతీష్,  నారాయణ, నైనాల మల్లారెడ్డి, మోకెనపెళ్లి బాబు, మెరుగు కుమార్, మొకెనపెల్లి సాగర్, ఇంజపురి అనిల్,  రఘు, మెరుగు ప్రకాష్, కాశ నరేష్, కాశ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.